వనపర్తి, ఫిబ్రవరి 17: స్వరాష్ట్ర స్వాప్నికుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, గట్టుయాదవ్, పట్టణాధ్యక్షుడు పలుస రమేశ్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను శనివారం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్లు కట్చేసి, మిఠాయిలు పంచారు. వనపర్తిలో బీఆర్ఎస్ జిల్లా, పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్, రమేశ్గౌడ్ సంయుక్తంగా ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు.
అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్చేసి రైతులకు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ర్ట ఏర్పాటు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కేసీఆర్తోనే సాధ్యమయ్యాయన్నారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ పేరును మార్చలేరన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ, సీనియర్, యువ, నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అయిజ, ఫిబ్రవరి 17: రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు ఆశాదీపం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు పల్లయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం పట్టణంలోని పీహెచ్సీలో గర్భిణులు, బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు మానస, మాజీ సర్పంచ్ కృష్ణ, లక్ష్మన్న, రంగన్న, చిన్న లక్ష్మన్న, చిన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.
గోపాల్పేట, ఫిబ్రవరి 17: గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లోని బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచారు. గోపాల్పేట పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ చంద్రశేఖర్, రైతుబంధు మండలాధ్యక్షుడు అడ్డాకుల తిరుపతియాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోదండం, కోఆప్షన్ సభ్యుడు ఎండీ మతీన్, ఆయాగ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు, ఫిబ్రవరి 17: పెబ్బేరులోని సుభాష్ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటం వద్ద కేకు కట్ చేశారు. పార్టీ శ్రేణులు ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామి, పార్టీ మండలాధ్యక్షుడు వనం రాములు, పట్టణాధ్యక్షుడు దిలీప్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మదనాపురం, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య, గ్రామాధ్యక్షుడు బాలకృష్ణ, బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, ఎంపీటీసీ సంఘం మండ లాధ్యక్షుడు కురుమయ్య, నాయకులు శ్రావణి, శివశంకర్, ఆంజనేయులు, జగన్, వెంకట్నారాయణ, రవీందర్రెడ్డి, శ్రావణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు, ఫిబ్రవరి 17: ఆత్మకూరులో నిర్వహించిన జన్మదిన వేడుకలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవికుమార్యాదవ్ నేతృత్వంలో ఎంపీపీ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, పీఏసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీధర్గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కేక్ కట్చేసి పార్టీ శ్రేణులకు పంచారు. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
అమరచింత, ఫిబ్రవరి 17: అమరచింత మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, మాజీ జెడ్పీటీసీ రాజేందర్సింగ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కౌన్సిలర్లు సింధు, లెనిన్, నర్సింహులుగౌడ్ తదితరులు ఉన్నారు.
కేటీదొడ్డి, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చక్రధర్రావు, పార్టీ మండలాధ్యక్షుడు ఉరుకుందు, వైఎస్ ఎంపీపీ రామకృష్ణానాయుడు, నాయకులు హనుమంతు, టీచర్ గోవిందు, యుగేంధర్గౌడ్, శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గట్టు, పిబ్రవరి 17: మండలంలోని రాయపురం పాఠశాలలో ఎంపీపీ విజయ్కుమార్ కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రంగస్వామి, ప్రవీణ్, రాముడు, బస్వరాజ్, ఉప సర్పంచ్ జనార్దన్, మహదేవ్, పాగుంటప్ప, సిద్ధ్దు, వెంకటేశ్, వీరేశ్, మారెన్న, జమ్మన్న, హెచ్ఎం అశ్విని, విద్యార్థులు పాల్గ్గొన్నారు.
మల్దకల్, ఫిబ్రవరి 17: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి అధ్వర్యంలో కార్యాలయంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. బిజ్వారంలో ఎంపీపీ రాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో ఉపాధ్యక్షుడు విష్ణ్ణు, డైరెక్టర్లు , నాయకులు నరేందర్, మధు, కుమ్మరి శేఖర్, ఉప్పరి నారాయణ, పెద్దమల్లన్న, తిమ్మప్ప, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
గద్వాల, ఫిబ్రవరి 17: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతితో కలిసి మున్సిపల్ చైర్మన్ కేశవ్ కేక్కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, నరహరిశ్రీనివాసులు, శ్రీమన్నారాయణ, ఎంపీపీ ప్రతాప్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, వైస్ ఎంపీపీ రామకృష్ణానాయుడు, జెడ్పీటీసీ రాజశేఖర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రామన్గౌడ్ నాయకులు పాల్గొన్నారు.
ధరూరు, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు డీఆర్ విజయ్కుమార్, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి కేక్ కట్ చేశారు. నాయకులకు, కార్యకర్తలకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమంలో జాంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నర్సింహులు, నాయకులు తదితరులు పాల్గ్గొన్నారు.
పాన్గల్, ఫిబ్రవరి17: మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ జన్మదిన కేక్కట్ చేశారు. అనంతరం దవాఖానలో రోగులు, కేజీబీవీలో విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు మండల కన్వీనర్ వెంకటయ్యనాయుడు, నాయకులు చంద్రశేఖర్నాయక్, ఎంపీటీసల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కేసీఆర్ జన్మధిన వేడుకలు
ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సామ్యనాయక్, మాజీ సర్పంచ్ వెంకటరమణ, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బాల్రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.
పెద్దమందడి, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలో సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్కట్ చేసి మిఠాయిలు పంచారు. పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దమందడి టౌన్ అధ్యక్షుడు సేనాపతి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నంబావి, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలోని జెడ్పీటీసీ వెంకట్రామమ్మ నివాసంలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు చిన్నారెడ్డి, డేగ శేఖర్, కురుమయ్య, గోపాల్నాయుడు ఉన్నారు.
కొత్తకోట, ఫిబ్రవరి 17: పట్టణంలోని చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ గుంతమౌనిక, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, కౌన్సిలర్లు కేసీఆర్ జన్మదిన కేక్ కట్చేసి బీఆర్ఎస్ నాయకులకు పంచిపెట్టారు. బాబురెడ్డి, భీంరెడ్డి, నాగన్నసాగర్, జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.