మహబూబ్ నగర్ : సమైక్య రాష్ట్రంలో ఏ మాత్రం పట్టించుకోని దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం దేవరకద్ర మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (ALIMCO) కాన్పుర్ సౌజన్యంతో స్త్రీ శిశు సంక్షేమ & సీనియర్ సిటీజన్స్ శాఖ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకారణాల పంపిణీ శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుందని, దివ్యాంగులకు రూ. 3016ల పింఛన్ అందజేస్తూ ఆత్మగౌరవంతో బతికేలా చేసారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో నియోజకవర్గంలో పేద కుటుంబాలకు సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, పేదవారికి ఎలాంటి ఆపద రానివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.