మహబూబ్నగర్టౌన్,జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉందని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ.నర్సింహులు విద్యా ర్థులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ పా లిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలిటెక్నిక్ స్పోర్ట్స్మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభచాటి విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని ఆకాక్షించారు. ఈ పోటీల్లో మహబూబ్నగర్,గద్వాల, కోస్గి, వడ్డేపల్లి, జేపీఎన్సీ, స్విట్స్, వనపర్తి కేడీఆర్,పెబ్బేర్ కళాశాలలకు చెందిన 300 ల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్ మీట్ కన్వీనర్ ప్రిన్సిపాల్ నాగరాజు, వనపర్తి ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, కోస్గి ప్రిన్సిపాల్ పరమేశ్వరి, హెచ్వోడీలు పాల్గొన్నారు.