అచ్చంపేటటౌన్, మే 19 : పై ర్లు పచ్చబడితే.. ప్రతిపక్షాల కండ్లు ఎ ర్రబడుతున్నాయని.. అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శిస్తున్నారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మండిపడ్డారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన, ఇవ్వని హామీలు నెరవేరుస్తున్న స ర్కార్పై అభాండాలు మోపితే సహించేది లేదని హెచ్చరించారు. కేబినెట్లో ఉమామహేశ్వర లిఫ్ట్ ఫేజ్-1, ఫేజ్-2 పనులపై నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. ప్రతిపక్ష నాయకులకు వక్రీకరించడం మంచి పద్ధతి కాదన్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షే మ పథకాలు అమలవుతున్నాయన్నారు. అచ్చంపేటలో వంద పడకల దవాఖానను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్నగర్కే వలసలు వచ్చే స్థాయికి అభివృద్ధి చేశామన్నారు. ఇం తటి అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు కన్ను కుట్టినట్లుగా ఉం దన్నారు. కేజీ టు పీజీ విద్యను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి పథకాలను చూసి కేసీఆర్ లాంటి నాయకుడు తమకు కూడా కావాలని మిగతా రాష్ర్టాల ప్రజలు కో రుకుంటున్నారన్నారు.
వికలాంగుడైన రాజశేఖర్ను కాంగ్రె స్ కార్యకర్తలు అమానుషంగా కొట్టడం బాధాకరమన్నారు. నిఖిత హత్య కేసులో ఉన్నతాధికారులతో మాట్లాడి రీ పో స్టుమార్టం చేయించామన్నారు. ప్రతి ఎకరాకూ నీళ్లందించే బాధ్యత తనదేనన్నారు. నియోజకవర్గంలోని వంగూరు, ఉప్పునుంతల, బల్మూరు మండలాలకు ప్రస్తుతం పుష్కలంగా సాగు నీరందుతుందన్నారు. సమావేశంలో రైతుబం ధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, జెడ్పీటీసీ మంత్రియా నాయక్, రాంబాబు, లోక్యా నాయక్, పట్టణ అధ్యక్షుడు రమేశ్, నాయకులు సుధాకర్, రాజేశ్వర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, పర్వతాలు, అమీనోద్దిన్ ఉన్నారు.