జడ్చర్ల, ఫిబ్రవరి 13 : జడ్చర్ల మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణం కనుల పండువలా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి గ్రామ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 100మందికిపైగా దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. ముందుగా స్వామివారికి ఎదురుకోళ్లు నిర్వహించారు. అనంతరం లక్ష్మీచెన్నకేశవస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
జడ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించి తరించారు. కార్యక్రమంలో ఆల య ఈవో దీప్తిరెడ్డి, మాజీ కమిటీ మార్కెట్ చైర్మన్లు గోవర్ధన్రెడ్డి, శోభాగోవర్ధన్రెడ్డి, జనార్దన్రెడ్డి, మాజీ వార్డు సభ్యులు విశ్వం, శ్రీనివాస్రెడ్డి, బ్రహ్మలింగం, యాదగిరి, మాజీ సర్పంచులు అనంతరెడ్డి, గోపాల్యాదవ్, చంద్రకళగోపాల్, మాజీ వైస్ ఎంపీపీ రాములు తదితరులు పాల్గొన్నారు.