జూరాల కాలువలో తల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలు వెలికితీత
క్షణికావేశం ప్రాణాలు తీసింది
మిన్నంటిన రోదనలు
పెబ్బేరులో విషాదఛాయలు
పెబ్బేరు, ఫిబ్రవరి 7 : ఏ కష్టం వచ్చిందో ఏమో కనీ సం ముక్కుపచ్చలారని చిన్నారుల గురించి కూడా ఆ లోచించని ఆ తల్లి.. ముగ్గురు పిల్లలను జూరాల కాలువలోకి తోసి తాను దూకి తనువు చాలించింది. ముగ్గు రు మృతదేహాలను సోమవారం వెలికితీయడంతో వనపర్తి జిల్లా పెబ్బేరులో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన ముదిరాజ్ స్వామి, మృతురాలు భవ్య ఏడేండ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగా కొనసాగింది. ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంటి వైశాల్యం చిన్నగా ఉండటంతో సమీపంలో కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు. దంపతుల కు ముగ్గురు పిల్లలు జ్ఞానేశ్వరి (5), వరుణ్ (3), నిహారిక(1) ఉన్నారు. భార్య, భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలతో మృతురాలు క్షణికావేశంతో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులకు తెలియకుండానే పట్టణ సమీపంలో ఉన్న జూరాల ఎడమ కాలువలో తమ ముగ్గురి పిల్లలను తోసి తాను దూకింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న బాబు వరుణ్ను స్థానికుడు కుమార్ అనే వ్యక్తి గమనించి సురక్షితంగా కాపాడాడు. తల్లి ఇద్దరు కూతు ళ్లు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. సోమవారం తల్లి భవ్య, కూతురు నిహారిక మృతదేహాలను గుర్తించి వెలికి తీశారు. వీరితోపాటు గల్లంతైన పెద్ద కూ తురు జ్ఞానేశ్వరి మృత దేహం గోపల్దిన్నె రిజర్వాయర్ సమీపంలో లభ్యమైంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ దవఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామస్వామి తెలిపారు.