జెడ్పీటీసీ బాసు శ్యామల
గట్టు, ఫిబ్రవరి 8: బడీడు పిల్లలు బడులకే వెళ్లాలని జెడ్పీటీసీ బాసుశ్యామల పేర్కొన్నారు. బలిగేరలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ తల్లిదండ్రులు వివక్ష లేకుండా పిల్లలను పెంచాలన్నారు. మగపిల్లలతోపాటు ఆడపిల్లలను కూడా బడులకు పంపాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రూపవతి, ఉపసర్పంచ్ హనుమంతు, పీఎస్ సురేశ్, హెచ్ఎం రంగన్న, ఎస్ఎంసీ చైర్మన్ ఇసాక్, అంగన్వాడీలు పాల్గొన్నారు.
బాలల హక్కులపై అవగాహన కల్పించాలి
మల్దకల్, ఫిబ్రవరి 8: బాలల కమిటీ సభ్యులు గ్రామాల్లో బాలల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తాసిల్దార్ సరితారాణి సూచించారు. మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ యాకోబు అధ్యక్షతన మంగళవారం బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. అలాగే చర్లగార్లపాడులో సర్పంచ్ శారదమ్మ అధ్యక్షతన బాలల కమిటీ సమావేశం నిర్వహించారు. సీడీపీవో కమలాదేవి హాజరై మాట్లాడుతూ.. బాలల హక్కులు, చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ రామకృష్ణ, ఎంపీటీసీ జయమ్మ, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామపెద్దలు, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.
బాలల హక్కులకు భంగం కలిగించొద్దు
మానవపాడు, ఫిబ్రవరి 8: బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపి బాలల హక్కులను కాపాడాలని చైల్డ్ లైన్ టీం మెంబర్ జయన్న అన్నారు. మండలంలోని నారాయణపురం, అమరవాయిలో మంగళవారం బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణారావు, కార్యదర్శి నర్సింహులు, ఉపాద్యాయు లు, అంగన్వ్డీలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
బాలల హక్కులను కాపాడాలి
ఉండవెల్లి ఫిబ్రవరి 8: బాలల హక్కులను ప్రతిఒక్కరూ కాపాడాలని చైల్డ్లైన్ టీమ్ మెంబర్ కృష్ణ పేర్కొన్నారు. మండలంలోని పుల్లూరులో సర్పంచ్ నారాయణమ్మ అధ్యక్షతన బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించి బాలల హక్కులపై ప్రజలకు వివరించారు.
బాలల హక్కులు పరిరక్షించాలి
కేటీదొడ్డి, ఫిబ్రవరి 8: గ్రామాల్లో బాలల హక్కులను పరిరక్షించడం సామాజిక బాధ్యతగా భావించాలని జెడ్పీ సీఈవో విజయనాయక్ అన్నారు. మండలంలోని గువ్వలదిన్నెలో మంగళవారం బాలల సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ సయ్యద్ఖాన్, సర్పంచ్ మహాదేవి, ఉప సర్పంచ్ జంగిలప్ప, పంచాయతి కార్యదర్శి బేగ్, హెచ్ఎం జ్యోతి, అంగణ్వాడి టీచర్స్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.
ఎర్రవల్లి చౌరస్తాలో..
ఎర్రవల్లి చౌరస్తా, ఫిబ్రవరి 8: మండలంలోని కోదండాపూర్ పంచాయతీ కార్యాలయంలోబాలల హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాలరక్షబ్ హేమలత, జ్ఞానేంద్రాచారి, సర్పంచ్ సుంకన్న, టీం మెంబర్ లక్ష్మి,రాజేశ్, గ్రామ పోలీస్ వెంకటస్వామి, హెచ్ఎం వెంకటేశ్వర్లు, సంధ్యారాణి, అలివేలు, మహ్మద్ బేగం,రాధ పాల్గొన్నారు.
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
అయిజ రూరల్, ఫిబ్రవరి 8: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని బాలల పరిరక్షణ విభాగం జిల్లా ప్రతినిధి ప్రకాశ్ పేర్కొన్నారు. మండలంలోని ఎక్లాస్పురంలో మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో సర్పంచ్ సునీత ఆధ్యక్షతన మంగళవారం బాలల పరిరక్షణ కమిటీని సమావేశం నిర్వహించారు.