జడ్చర్లటౌన్, జూలై 26 : జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటవుతున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏడాదికాలంలోనే హరితవనంగా రూ పుదిద్దుకున్నది. ప్రత్యేకంగా రాష్ట్ర చిత్రపటం ఆకారంలో జిల్లాల వారీగా విభాగాలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది జూలై 17న కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సదాశివయ్యను పిలిచి అభినందించారు. అంతేకాకుండా తెలంగాణ బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ స్వయంగా రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో తెలంగాణ బొటానికల్ గార్డెన్ మరింత అ భివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర చిత్రపటం ఆకారంలో ఒక్కో జిల్లా విభాగంలో ఆ జిల్లాకు ప్రత్యేకత ఉన్న మొక్కలను తెచ్చి నాటారు. ఇప్పటికే 23 జిల్లాలకు సంబంధించిన మొక్కలు తెచ్చి నాటారు. మిగతా జిల్లాల విభాగాల్లో మొక్కల పెంపకంపై దృష్టిసారించారు. మొక్కలకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేశారు. కోడ్ను స్కాన్ చేసి మొక్క ప్రత్యేకతను సెల్ఫోన్లో చూసుకునేలా అందుబాటులో తీసుకొచ్చారు. దీనికితోడు గార్డెన్లో దాదాపు 12 లక్షల లీటర్ల నీటిని ఒడిసి పట్టేలా ట్యాంక్ నిర్మించారు. అలాగే సీఎం కేసీఆర్ పేరున ప్రత్యేకంగా 600 మొక్కలు నాటారు.
ఆయా జిల్లాల నుంచి తీసుకొచ్చిన మొక్కలు..
ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం..
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. గార్డెన్ అభివృద్ధికి ఏడా ది కిందట సీఎం కేసీఆర్ రూ.50 లక్షలు మంజూరు చేశారు. రూ. 10 లక్షలతో జిల్లాల వారీగా వి భాగాలు ఏర్పాటు చేసి మొక్కలు నాటాం. మిగతా డబ్బుతో జిల్లా ల వారీగా మధ్యలో అంతర్గత రహదారులు, మొక్కల సంరక్షణకు నెట్హౌజ్ ఏర్పాటు చేయనున్నాం. అదే విధంగా పరిశోధన ల్యాబ్, కంప్యూటర్లు, మైక్రోస్కోప్ ఏర్పాటు చేయనున్నాం. కళాశాల ప్రిన్సిపాల్ అప్పియ్య చిన్నమ్మతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యుల సహకారంతో గార్డెన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వచ్చే ఏ డాదికల్లా పూర్తిస్థాయిలో గార్డెన్ రూపుదిద్దుకుంటున్నది.