మల్దకల్, డిసెంబర్ 20 : ఆదిశిలా క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం, ఆలయ ముఖ్య ద్వారాలను బుధవారం తంబిహళ్లి మఠం పీఠాధిపతి విద్యాసింధు మాధవస్వామితో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్లకు ఆలయ కమిటీ చైర్మన్తోపాటు ఈవోలు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేను స్వామీజీ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. బిజ్వారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ సత్యారెడ్డి, సతీమణి మాణిక్యమ్మ దంపతులు, ఆలయ ఆవరణలో భక్తుల భోజన సౌకర్యం కోసం రూ.18 లక్షలతో అన్నదాన సత్రాన్ని నిర్మించారు. అలాగే ఆలయ ముఖ్య ద్వారాలకు టేకు తలుపులు గద్వాల పట్టణానికి చెందిన బాణాల పుష్పవతి శేషుఫణి దంపతులు రూ.9 లక్షలతో చేయించారు. నాలుగో ద్వారాన్ని శాంతినగర్కు చెందిన శివశివాని పాఠశాల కరస్పాండెంట్ ఈశ్వరీశ్యాంసుందర్ రూ.9లక్షలతో నిర్మించారు.
ఆలయ ఆవరణలో రూ.10 లక్షలతో నిర్మించిన రేకుల షెడ్డును మండలకేంద్రానికి చెందిన కటికె సుశీలాబాయికృష్ణాజీరావు దంపతులు నిర్మించారు. ఆలయ ఆవరణలో ముసల్గౌడ్ దంపతులు రూ.5 లక్షలతో టైల్స్ వేసి ఆలయ అభివృద్ధికి సహకరించగా స్వామిజీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి దాతలను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్దకల్ తిమ్మప్పక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుందని, భక్తులు విరివిగా విరాళాలు ఇచ్చి స్వామి వారి కోసం వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు కల్పించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. అలాగే ఆలయాభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి, చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ సత్యారెడ్డి, విక్రంసింహారెడ్డి, అరవిందరావు, బాబురావు, మల్లికార్జున్రెడ్డి, నాగరాజుశర్మ, వెంకోబరావు, చంద్రశేఖర్రావు, నాయికిమధు, నరేందర్, అర్చకులు మధుసూదనాచారి, ధీరేంద్రదాస్, శశాంకాదాస్, రమేశ్చారి, రవిచారితోపాటు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.