వనపర్తి, ఏప్రిల్ 11 : బహుజన సామాజిక అభివృద్ధి కోసం పరితపించిన నేత బహుజనుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావుఫూలే అని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాజీ మంత్రి నివాసంలో ఫూలే చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫూలే బడుగు, బలహీన వ ర్గాలు, మహిళల అభున్నతి కోసం అహర్నిశలు శ్ర మించారని, ఆయన ఆశయాలను తెలంగాణ ఏర్పాటుతో మళ్లీ కేసీఆర్ కొనసాగించారని ఉద్ఘాటించారు.
ఫూలే పేరిట గురుకుల పాఠశాలలు ఏర్పాటు చే సి బడుగు, బలహీన వర్గాల బిడ్డల ఉన్నత చదువులకు శ్రీకారం చుట్టారన్నారు. విదేశీ విద్యకు కూడా చేయూత కల్పించారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పరంజ్యోతి, అశోక్, జాత్రునాయక్, నాగన్నయాదవ్, తిరుమల్, నీలస్వామి, శ్రీ ను, జోహెబ్, గిరి, వెంకటేశ్, శేఖర్, శంకర్నాయక్, గులాం, బాబుమియ్య, రహీం, ఆరీఫ్ పాల్గొన్నారు.