నాగర్కర్నూల్, ఏప్రిల్ 23 : కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని నా గర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రానికి సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన జిల్లా స మీకృత కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయ పనుల ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆర్అండ్బీ అధికారులతో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. పనులు ఎప్పటికి పూర్తవుతాయనే విషయాల ను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ త్వరగా ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. రెండు వారాల్లో పనుల న్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ శ్రీశైలం, కౌన్సిలర్లు ఖాజాఖాన్, నాయకులున్నారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
మండలంలోని మంతటి చౌరస్తా సమీపంలో రో డ్డు ప్రమాదానికి గురైన వారిని ఎమ్మెల్యే దవా ఖానకు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే తేజ కన్వెన్షన్కు వెళ్తున్న సమయంలో అక్కడే కారు, బైక్ ప్రమాదంలో గాయపడిన కాళ్ల శివుడును అటుగా వెళుతున్న 102 అంబులెన్స్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి దవాఖాకు తరలించారు. విషయం డాక్టర్కు ఫోన్లో సమాచారమిచ్చి వైద్య సేవలు అందించాలని సూచించారు.