కొల్లాపూర్, జూన్ 9 : నిత్యం పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మైనింగ్ అధికారులు, ఇంటలిజెన్స్ అధికారులు సైతం పర్యటించే ప్రదేశంలో యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా కొనసాగుతుంది అంటే ఒకింతా ఆశ్చర్యం కల్గిస్తుంటుంది. కానీ ఇది వా స్తం అక్రమ దందాలు అన్ని ఇక్కడే సాధ్యమవుతాయని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
పీఆర్ఎల్ఐ మొదటి రిజర్వాయర్, డెలివరీ సిస్టెర్న్కు అతి సమీపంలోని అంజనగిరి గ్రామంలో అనధికరింగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ ట్రాక్టర్లలో ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. పట్టపగలు ఫిల్టర్ ఇసుక దందా నడుస్తుంటే ఎవరూ పట్టించుకోరా అనే అనుమానం రావొచ్చు. కానీ నెలనెలా మామూళ్లలతోపాటు, అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉన్నందుకే కళ్ల ముందు అక్రమ దందా కనబడుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిల్టర్ ఇసుక దందా గురించి అందరికీ తెలుసునని, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎవరూ తమ ట్రాక్టర్లను సీజ్ చేయడం కానీ, కేసులు నమోదు చేసే ధైర్యం చేయరని అక్రమార్కులు పేర్కొంటున్నారు. మంత్రి జూపల్లి ఇలాకాలో ఇంతా అక్రమ ఇసుక దందా నడుస్తున్నా పట్టించుకోవడం లేదని, పరోక్షంగా అక్రమ ఇసుక దందాకు మంత్రి జూపల్లి సహకరిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.