జడ్చర్లటౌన్, మార్చి 6 : జడ్చర్ల దవాఖాన మార్చురీలో జరిగిన ఘటనపై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి మృతుడి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి అఖిలపక్షం నాయకులు ధర్నా చేపట్టారు. ద ళితుడైన భీమేశ్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామంటూ బైఠాయించారు.
ఈ సందర్భంగా పలువురు అఖిలపక్షం నాయకులు మాట్లాడు తూ ప్రభుత్వం బాధ్యత వహించి మృతుడి కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదే విధంగా రెండు ఎకరాల ప్రభుత్వ భూమి, ప్రభుత్వ దవాఖానలో ప్రైవే టు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇంటితోపాటు మృతుడి కుమారుడిని గురుకుల పాఠశాలలో సీటు క ల్పించాలని కోరారు. అనంతరం డీటీ మాధవికు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజే పీ, సీపీఐ, బీసీసేన, ఎమ్మార్పీఎస్, గిరిజన విద్యార్థి సంఘం, బహుజన పార్టీల నాయకులు పాల్గొన్నారు.