మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 20 : ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 23 మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బోయపల్లి, మోతినగర్కు చెందిన 500 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. అ నంతరం మాట్లాడుతూ అత్యవసర వే ళల్లో దవాఖానల్లో చేరుతున్న వారు రా త్రీ పగలు తేడా లేకుండా తనకు ఫోన్ చేస్తే అవసరమైన చికిత్స అందేలా చర్య లు తీసుకుంటామన్నారు. వీరికి సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థిక భరోసా కల్పిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలే మా బ లమని పేర్కొన్నారు. అభివృద్ధి చూసి ఓ ర్వలేక మతతత్వశక్తులు గొడవలు సృ ష్టించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కులమతాల పేరిట రాజకీయం చేస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. కార్యకర్తకు చిన్న ఆపద వచ్చినా అర్ధరాత్రి సమాచారం ఇస్తే ఆ దుకుంటామన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. డప్పులతో మార్మోగిం ది. అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులా బీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మ న్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ప్రధాన కార్యదర్శి వినోద్, రై తుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గో పాల్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
రూ.2 వేల పింఛన్ ఎక్కడా లేదు
హన్వాడ, సెప్టెంబర్ 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకంతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా ఏర్పడుతున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్ అందించే పథకం దేశంలో ఎ క్కడా లేదన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో నూతనంగా మంజూరైన పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.600 నుంచి రూ. 800 మాత్రమే పింఛన్ అందిస్తున్నారని తెలిపారు. హన్వాడ మండలానికి కొత్త గా 1,350 పింఛన్లు మంజూరయ్యాయ ని తెలిపారు. అనంతరం 202 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చై ర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజు యాదవ్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు రత్నాకర్గౌడ్, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ వి జయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, సర్పంచ్ రేవతి, ఎంపీటీసీలు సత్యమ్మ, కల్పన ఉన్నారు.