మహబూబ్నగర్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖిల్లాఘణపురం : కారణ జన్ముడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కొందరి పుట్టుక చరిత్రలో శాశ్వతం గా నిలుస్తుందని, దాన్ని ఎవరూ కాదనే పరిస్థితి ఉందన్నారు. వర్తమానమే కాదు.. భవిష్యత్ తరాలూ మరిచిపోలేని నేత ముఖ్యమంత్రి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్ మండలం శాపూర్ గ్రామం వద్ద ఎంజీకేఎల్ఐ కాల్వను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన వయాడక్ట్తోపాటు కాలువలో నిర్వహించిన ట్ర యల్న్న్రు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచిందన్నారు. ఒక మనిషి, ఓ పార్టీ దార్శనికత, చరిత్ర గతిని, కాలగతిని ఎలా మారుస్తాయో తెలంగాణ, కేసీఆర్యే ఉదాహరణ అన్నారు.
రైతు కష్టంలో పాలు పంచుకుని ఆ కష్టం నుంచి బయటపడేందుకు గొప్పగొప్ప పథకాలు తెచ్చిన నేత కేసీఆరే అన్నారు. తాగే నీళ్లల్లో, పొలాల్లోపారే సాగునీళ్లల్లో, పండే పంటల్లో, ధాన్యం కల్లాల్లో పంటను అ మ్మితే పడే డబ్బుల్లో కేసీఆర్ కనిపిస్తారని స్పష్టం చేశా రు. రైతుకు ప్రతిరోజూ కేసీఆర్ జన్మదినమే అని ఆనం దం వ్యక్తం చేశారు. ప్రతిపథకం, ప్రతిపనిలో ఆయనే అన్నారు. అసాధాన్ని సుసాధ్యం చేయడంలో ముఖ్యమంత్రికి మించిన వారే లేరన్నారు. వనపర్తి సాగునీటి కోసం ఎంతో కష్టపడ్డాం, సీఎం కేసీఆర్ను ఒప్పించి, మెప్పించి సాగు జలాలను తీసుకువచ్చామని చెప్పారు. పెద్దమందడి, ఘణపురం కాల్వల నుంచి 75 వేల ఎకరాలకు నీరు అందిస్తే ఎంజీకేఎల్ఐ పథకాన్ని 25 టీ ఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచి సాగునీటిని సా ధించామన్నారు. సాగునీరు వచ్చాక రైతుల్లో ధీమా పెరిగిందని పేర్కొన్నారు.
సాగునీళ్లు సాధించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి నిరంజన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో సోయే లేదు : ఆల ఎంజీకేఎల్ఐ నీరు పక్కనే పారుతున్నా ఇక్కడి రైతులకు సాగునీరు అందించాలన్న తపన, కానీ సోయి కానీ కాంగ్రెస్ నేతలకు లేకుండా పోయిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో మంత్రిగా వ్యవహరించిన చిన్నారెడ్డి ఇక్కడి ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ వచ్చాక సాగునీరు అందించేందుకు మంత్రి నిరంజన్రెడ్డి చేసిన తపన మరువలేనిదన్నారు.
సీఎం కేసీఆర్తో కలిసి ఈ ప్రాజెక్టు గురించి చెబుతుంటే పాలమూరు ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి నీరు అందించేలా చూస్తామన్నారు. రూ.వంద కోట్లు ఇస్తే ఘణఫురం కెనాల్ నుంచి 25 వేల ఎకరాలకు సాగనీరు అందించవచ్చని, ఆరుపంటలకు ముందే మనం నీళ్లు ఇవ్వొచ్చని చెప్పగానే సీఎం వెంటనే మంజూరు చేశారని చెప్పారు. ఆనాటి కష్టం నేడు కండ్ల ముందు కనబడుతుందని చెప్పారు. ఈ కాల్వ పూర్తయి సాగునీరు పా రుతుంటే రైతుల ఆనందం అంతా.. ఇంత కాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సా మ్యానాయక్, విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, అడ్డాకుల విండో చైర్మన్ జితేందర్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.