ఉమ్మడి జిల్లాలోని ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభంకాగా.. అప్పటికే కేంద్రాల వద్ద బారులు కనిపించాయి.
సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ కొనసాగగా.. పట్టణాలు, పల్లెలు కిటకిటలాడాయి. వృద్ధులు, దివ్యాంగులు సైతం వీల్చైర్లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొదటి సారి ఓటేసిన యువత సిరా గుర్తును చూపుతూ సంబురపడ్డారు. పలు చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో సరళిని అధికారులు పర్యవేక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పరిశీలించారు. సాయంత్రం ఈవీఎంలను స్ట్రాంగ్రూంలకు తరలించి భద్రపరిచారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.