కొత్తకోట, ఫిబ్రవరి 5 : సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం పట్టణంలోని చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్ మాట్లాడుతూ గద్దెనెక్కి రెండు నెలలు కావస్తున్నా ఏ ఒక్క పథకం అమలుకు నోచుకోలేదని దుయ్యబట్టారు. ఫ్రీ సర్వీసుతో ఆర్టీసీ బ స్సుల్లో మహిళలకు తగవు పెట్టారని, దీంతో ఆటో డ్రైవ ర్ల బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీఆర్ఎస్కు పోరాటాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, గ్రామాల్లోని టీడీపీ, కాంగ్రెస్ నేతలను తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబుకు తొ త్తుగా ఉన్న రేవంత్రెడ్డి ప్రజలను మైమరిపించడానికే కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డా రు. రేవంత్ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో పో లీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని ఒకరినొకరు తోసుకున్నారు. నిరసన కార్యక్రమంలో ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, ప్రశాంత్, బాలకృష్ణ, ఆకుల శ్రీను, బాల్నారాయణ, అయ్యన్న, పద్మానెహ్రు, కిరణ్, గోవిందునాయుడు, నగేశ్, చింటు, యాదగిరి, తిరుపతయ్య, సం జీవుడు, రాములుయాదవ్, లక్ష్మణ్నాయక్, సత్యం, రాజు, రఘువర్ధన్రెడ్డి, నరేశ్గౌడ్ పాల్గొన్నారు.