కృష్ణ, డిసెంబర్ 30 : పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చే యాలని ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు లు అన్నారు. ఎఫ్ఎల్ఎన్ పర్యవేక్షణలో భాగంగా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతోపాటు పలు పాఠశాలలను శుక్రవారం ఆయన సందర్శించి పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ గణిత శాస్ర్తానికి సంబంధించిన సూత్రాలను అడిగారు. విద్యార్థులు ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాల, జిల్లాకు మంచి పే రు తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, ప్రతి వారం స్లిప్ టెస్ట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నిజాముద్దీన్, రాజేశ్వర్, ఉపాధ్యాయులు తదితరు లు పాల్గొన్నారు.
మాగనూర్, డిసెంబర్ 30 : మండలంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ పరీక్షను ఇన్చార్జి డీ ఈవో గోవిందరాజులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ జిల్లా లో అన్ని పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల సామర్థ్యాల స్థాయిని అంచనా వేయుటకు ఎఫ్ఎల్ఎన్ పరీక్షలను ని ర్వహించడం జరుగుతున్నదన్నారు. అనంతరం విద్యార్థుల మధ్యాహ్న భో జనాన్ని పరిశీలించారు. పాఠశాలలో సాగుతున్న మన ఊరు మన బడి కా ర్యక్రమం పనులను చూసి నాణ్యతతో కూడిన పనులు చేయాలన్నారు. పను లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. మం డలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల చ దువులపై అడిగి తెలుసుకున్నారు. అ దే సమయంలో పాఠశాల ప్రాంగణంలో ఆటలు ఆడుతున్న విద్యార్థులను చూసి అన్ని రంగాల్లో ముందుండాలని ఆయ న సూచించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, డిసెంబర్ 30 : ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థులకు సామర్థ్యపు పరీక్షలు నిర్వహిచారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన సామర్థ్యపు పరీక్షలను మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ శు క్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రాథమిక సామర్థ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తొలి మెట్టు కార్యక్రమం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు క నీస వసతులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మన ఊరు – మన బడి కార్యక్రమంతో మౌలిక సదుపాయాలను ఏ ర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. ఎఫ్ఎల్ఎన్ పరీక్ష లు ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో చేపట్టామన్నారు.