మక్తల్టౌన్, ఏప్రిల్ 21 : పోలీస్ సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహించకుండా ప్రతి పోలీసు విధులు నిర్వహించాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మక్త ల్ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో సిబ్బంది పని తీరుపై సీఐ సీతయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎ స్పీ మాట్లాడుతూ మండలంలో ఎలాంటి గొడవలు, తగాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు గ్రామాల్లో పర్యటించాలన్నారు. కార్యక్రమంలో సీఐ సీతయ్య, ఎస్సై పర్వతాలు పాల్గొన్నారు.
సమయ పాలన పాటించాలి
మరికల్, ఏప్రిల్ 21 : పోలీస్ స్టేషన్లో ఉదయం 9 గంటలకు నిర్వహించే రోల్కాల్, జనరల్ డైరీ ఎంట్రీలకు పోలీసులు సమయపాలన పాటించాలని డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే 100 డయల్స్పై స్పందించాల ని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీ కాంత్రెడ్డి, ఎస్సై హరిప్రసాద్రెడ్డి ఉన్నారు.
సైబర్ నేరాలపై జాగ్రత్తలు పాటించాలి
సెల్ఫోన్లో సామాజిక మాధ్యమాల ద్వా రా వచ్చే సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మరికల్ ఎస్సై హరిప్రసాద్రెడ్డి సూచించారు. శుక్రవారం పోలీస్ కళాజాత బృందం ఎలిగండ్ల ప్రజలకు సైబ ర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవమ్మ, ఉపసర్పంచ్ మోహన్, కళాజాత బృందం సభ్యులు సురేందర్గౌడ్, శేఖర్, లింగప్ప, కల్యాణి, రూక్యనాయక్ పాల్గొన్నారు.