దేవరకద్ర, అక్టోబర్ 22 : సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్న సంక్షేమపథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. తెలంగాణలో అందుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతిగడపకూ వెళ్లి వివరించారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతిఒక్కరికీ వంట గ్యాస్ రూ.400కే అందిస్తామని తెలిపారు. ఈసారి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే ఆలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయవెంకటేశ్, పట్టణ అధ్యక్షుడు బాలరాజు, నాయకులు సత్యంసాగర్, రాము, రాధాకృష్ణ, యుగేంధర్ రెడ్డి, చాల్మారెడ్డి, సయ్యద్ జక్కి పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, అక్టోబర్ 22 : సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయగా ఆదివారం బీఆర్ఎస్ నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్ మాట్లాడుతూ రైతులకు, మహిళలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, 93 లక్షల పేదలకు బీమా సౌకర్యం, రూ.400లకే సిలిండర్, పేద మహిళలకు రూ.3వేల ఆర్థిక సాయం వంటి పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, వైస్ చైర్పర్సన్ జయమ్మ, కౌన్సిలర్లు రాములుయాదవ్, కొండారెడ్డి, సంధ్య, పద్మ, తిరుపతయ్య, రామ్మోహన్రెడ్డి, ఖాజమైనుద్దీన్, నాగన్నసాగర్, మిసేక్, వహీద్ పాల్గొన్నారు.
కారు గుర్తుకే ఓటు వేయాలి
భూత్పూర్, అక్టోబర్ 22 : బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటూ నాయకులు, కార్యకర్తలు మండలంలోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి మద్దిగట్ల గ్రామంలో, మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కొత్తమొల్గరలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, గోప్లాపూర్లో సత్యనారాయణ, పోతులమడుగులో సత్యనారాయణ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.