ధన్వాడ, జూలై 11 : సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభు త్వం గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్త్తుందని, అందులో భాగంగా జిల్లాలో మొదటి సారిగా కిష్టపూర్కు చెందిన ముగ్గురు గిరిజన రైతులకు పోడుభూముల పట్టా లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు.
మంగళవారం కిష్టాపూర్లో గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో గిరిజనులకు మహర్దశ ప్రారంభమైందని, వారు సాగు చేసుకొనే భూములకు పట్టాలిచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీడీవో సద్గుణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డితోపాటు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.