అలంపూర్, జూన్ 4 : పేదల సొంటింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని క్యాతూరులో డబుల్ బెడ్రూం ఇండ్లను జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్ వల్లూరు క్రాంతిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం రూ.22లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. తొమ్మిదేండ్లలోఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని కొనియాడారు. రైతులకు మద్దతుగా నిలవాల్సిన కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో గృహలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ విడతల వారీగా సాయం అందిస్తామన్నారు. అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా గృహలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు.
కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూంలు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రూ.22లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రైతువేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని, ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో సాగు, తాగునీటికి కొరత లేదన్నారు. పసిడి పంటలు పండుతున్నాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, ఎంపీపీ బేగం, సర్పంచ్ లలిత మ్మ, ఎంపీటీసీ అనురాధ, తాసీల్దార్ సుభాష్ నాయు డు, ఏడీఏ సక్రియా నాయక్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శం..
వనపర్తి రూరల్, జూన్ 4 : ఉమ్మడి రాష్ట్రంలో ఆకలితో అల్లాడిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నాగవరం గిరిజనతండాలో బీఆర్ఎస్ నాయకుడు రఘు ఆధ్వర్యంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల పాలనలో ప్రణాళికాబద్ధంగా అన్ని రంగాలను సమూల మార్పులు చేసి అభివృద్ధి దిశ గా పయనించేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిందన్నారు. గతంలో వలసలు వెళ్లి తండాల్లో ఇండ్లకు తాళాలు వేసి కనిపించేవని, ప్రస్తుతం వారంతా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, రాష్ట్ర స హకార యూనియన్ బోర్డు సభ్యుడు తిరుమల మ హేశ్, నాగవరం పీఏసీసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, రఘు, హరి, రవినాయుడు, విష్ణుసాగర్ పాల్గొన్నారు.