నాగర్కర్నూల్, నవంబర్ 23 : ది వ్యాంగులు ప్రతిభావంతులని, వారి సం క్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. మనోధైర్యం, ఆత్మ వి శ్వాసంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ బుద్ధిమాంద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను కలెక్టర్ జెండాఊపి ప్రా రంభించారు.
ఈ సందర్భంగా స్థానిక ఆ ర్టీసీ సంస్థ నుంచి మంజూరైన 35 మం ది దివ్యాంగులకు ఉచిత బస్సు పాసుల ను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీయడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. ట్రై సైకిల్, జావలిన్త్రో, చెస్, క్యారమ్స్, షార్ట్ఫుట్, 50 మీటర్లు, 200 మీటర్ల పరుగుపందాలు, ట్రై సైకిల్ వం టి క్రీడా పోటీలను నిర్వహించారు. అం ధ, ముద్ధిమాంద్యం, శారీరక దివ్యాంగ విజేతలకు డిసెంబర్ 3న ఏర్పాటు చేసే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నారు. పోటీల్లో 450 మంది ది వ్యాంగులు పాల్గొన్నారు.
కార్యక్రమం లో మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, దివ్యాంగుల జిల్లా ఇన్చార్జి సం క్షేమాధికారి దమయంతి, ఆర్టీసీ డీఎం ధరంసింగ్, ఎస్జీఎఫ్ ప్రసాద్గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు సీతారాంనాయక్, వెంకటయ్య, శేఖర్బాబు, సు భాషిని, సరిత, సత్యనారాయణ, విజిలె న్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు నిరంజన్, రాజశేఖర్, గౌతమ్, బాలీశ్వ ర్, నాగర్కర్నూల్ పట్టణ ప్రెసిడెంట్ భీ మ్సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జి ల్లా కోశాధికారి గట్టు రఘునందన్రెడ్డి, కొల్లాపూర్ డివిజినల్ ప్రధాన కార్యదర్శి నారాయణమ్మ, శంకర్, నిర్మల, నిరంజ న్, బాలపీరు, దివ్యాంగులు ఉన్నారు.