గోపాల్పేట, జనవరి 3 : సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కా ర్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని తెలిపారు. గోపాల్పేట మండలం అమడాలకుంట తండాకు చెందిన కాం గ్రెస్ పార్టీ సీనియర్ నేత రాత్లాలావత్ చంద్రునాయక్తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పాత్లావత్ హనుమంత్ నాయక్ ఆధ్వర్యంలో మం త్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసం లో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరి న వారికి కండువాలు కప్పి మంత్రి సా దరంగా ఆహ్వానించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి సర్కార్ పెద్దపీట వేసిందని తెలిపా రు. కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. నాయకులు గోవింద్ నాయక్, కర్రోళ్ల భాస్కర్, పు రందాస్ నాయక్, విజయ్ నాయక్, చం ద్రూనాయక్, హనుమంతు మంత్రి ని రంజన్రెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు.
జయశంకర్ విగ్రహానికి తుది మెరుగులు..
ఆచార్య జయశంకర్ విగ్రహ తయారీకి తుది మెరుగు లు దిద్దుతున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని అత్తాపూర్లో జయశంకర్ విగ్రహ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తిలోని రాజపేట శివారులో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాక్ గార్డెన్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వనపర్తి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పట్టణ వాసులకు ఆహ్లాదం అందించాలనే ఉద్దేశంతో ఈ పార్కును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాజనగరం అమ్మ, న ల్ల, ఈదుల చెరువు, లక్ష్మీకుంట విస్తరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పార్కుల సుందరీకరణ, చెరువుల విస్తరణ, ఎకో పార్కు ఏర్పాటుతో ప్రకృతి ప్రేమికులు సేద తీరుతున్నారని మంత్రి తెలిపారు.