మహబూబ్నగర్, ఫిబ్రవరి 2 : సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని శాఖల అధికారులు బాధ్యతగా పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని కలెక్టర్ జి.రవి అన్నారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గురువారం సమీకృత కలెక్టరేట్లో పూర్వపు కలెక్టర్ వెంకట్రావు, పూర్వ పు అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు వీడ్కోలు, నూతన కలెక్టర్కు స్వాగత కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బా ధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేటప్పుడు ఇక్కడ ఎంతో కరువు, జిల్లా ఎలా ఉంటుం దో ఏమో అని అనుకున్నానని, ఇక్కడ కలెక్టర్గా పనిచేయడం వల్ల జన్మధన్యమైనదని పూర్వపు కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మహబూబ్నగర్ జేసీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు 14 రోజులకు ఒకమారు నీ రు వచ్చేదని, నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దూరదృష్టితో జిల్లా రూపురేఖలను మార్చారని తెలిపారు. మంత్రి సూచన మేరకు అధికారులందరూ బాధ్యతగా పనిచేసి మహబూబ్నగర్ను ఉ న్నతంగా తీర్చిదిద్దారని చెప్పారు. మహబూబ్నగర్ జేసీగా, కలెక్టర్గా విధులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అందరితో కలిసిమెలిసి ఉంటూ పనులు చేయించుకోవడం జరిగిందని, ఎవరితోనూ ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని తెలిపారు.
మహబూబ్నగర్ అదనపు కలెక్టర్గా వచ్చినప్పుడు తెలుగు మాట్లాడానికి కూడా రాలేదని వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఇక్కడ తెలుగు నేర్చుకోవడంతోపాటు అన్నివిధాలా అడ్మినిస్ట్రేషన్ చేయడం వంటి ఎన్నో మంచి విషయాలను పూర్వపు కలెక్టర్ వెంకట్రావు నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు. మున్ముందు మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతోపాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం టానన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నర్సిం హ, అదనపు కలెక్టర్ సీతారామారావు, ప శుసంవర్ధకశాఖ అధికారి మధుసూదన్గౌడ్, తాసిల్దార్ బక్క శ్రీనివాసులు, హౌసింగ్శాఖ జిల్లా అధికారి వైద్యం భాస్కర్, టీజీవో అ ధ్యక్షుడు రాజగోపాల్, జేఏసీ చైర్మన్ రాజీవ్రెడ్డి, టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి చంద్రానాయక్, చెన్నకిష్టన్న పాల్గొన్నారు.