భూత్పూర్, జనవరి 13 : సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని అన్నాసాగర్లో శుక్రవారం అమిస్తాపూర్కు చెందిన రఫీక్కు రూ.11వేలు, భూత్పూర్కు చెం దిన యాదయ్యకు రూ.24వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపత్కాలంలో పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందన్నారు. అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను సీఎం సహాయనిధితో ఆదుకుంటున్నట్లు చెప్పారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా సీఎంఆర్ఎఫ్ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఆలకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
భూత్పూర్కు చెందిన రాచూరి బాబు అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి.. ఎమ్మెల్యే ఆల సూచన మేరకు రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రమౌళి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్తూర్ సురేశ్గౌడ్, బో రింగ్ నర్సింహులు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.