బిజినేపల్లి : శనివారంన వచ్చే విదియ ( Vidiya ) తిథిన శనీశ్వరుడికి (Shaniswara Swamy temples ) ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా బిజినేపల్లి మండలంనంది వడ్డేమాన్ గ్రామంలో ఉన్న శనేశ్వర స్వామికి భక్తులు తిల, తైల అభిషేక, అర్చన, ప్రత్యేక పూజలు, అభిషేకాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ భక్తులు ప్రతి మాసంలో శనివారం అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజించి అభిషేకించిన విశేష పుణ్యఫలతం దక్కుతుందని అన్నారు.ఈ మాసం శనేశ్వర స్వామిని పూజించిన ఆరాధించిన విశేష పలితం ఉంటున్నది అన్నారు. ఇక్కడ గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి భక్తులచే సామూహిక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకపూజలు,అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు.
భక్తులు జమ్మి చెట్టుకు19 ప్రదక్షణలు వేదమంత్రచరణల మధ్య చేశారు. గణపతి, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రావు, కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, వీర శేఖర్, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.