అచ్చంపేటరూరల్, జనవరి 1 : శ్రీశైల ఉత్తర ద్వారంగా బాసిల్లుతున్న ఉమామహేశ్వరాలయాని కి సోమవారం భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు చేరుకొని స్వామివారికి అభిషేకంతోపాటు పూజలు చేశారు. ఇబ్బందులు కలుగకుండా ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశా రు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది ఉన్నారు.