మహబూబ్ నగర్ : జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం పాత మొల్గర గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ( Congress leaders ) మంగళవారం బీఆర్ఎస్ ( BRS ) పార్టీలో చేరారు. మాజీ సర్పంచ్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీని వీడి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం అన్నాసాగర్ గ్రామంలో మండలంలోని పాత మొల్గర,కొత్త మొల్గర, కప్పేట, కరివెన, లంబడికుంట తండా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జ్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం, బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆల వెంకటేశ్వర్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.