కల్వకుర్తి/అచ్చంపేట/ఉండవెల్లి, జనవరి 1 : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను శ నివారం హైదరాబాద్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి నూతన సం వత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ను కలిసిన వారిలో ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఆయన సతీమణి గువ్వల అమల ఉన్నారు. నియోజకవర్గ సమస్యలు, అచ్చంపేట మున్సిపల్ అభివృద్ధిని విప్ గువ్వల మంత్రి కేటీఆర్కు వివరించారు. మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అలాగే మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిని ఎమ్మెల్యే అబ్రహం, అతడి భార్య విజయలక్ష్మి, తనయుడు అజయ్కుమార్తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అజయ్ సేవాదళం క్యాలెండర్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.