అయిజ, డిసెంబర్ 16 : అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జోగుళాంబ గద్వాల జిల్లా, ధరూరు మండలం, భీంపురం గ్రామ జట్టు విజేతగా నిలిచింది. మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని వరాహాంజనేయస్వామి బ్రహ్మోత్స వాలను పురస్కరించుకొని రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన 30 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ పోటీల్లో భీంపురం, అయిజ యూనిక్ స్పోర్ట్స్ గ్రామాల కబడ్డీ క్రీడాకారులు తలపడ్డాయి. పోటీలో భీంపురం గ్రామానికి చెందిన జట్టు మొదటి స్థానంలో నిలువగా, అయిజ పట్టణానికి చెందిన యూనిక్ స్పోర్ట్స్ జట్టు రెండో స్థానంతో సరి పెట్టుకున్నది. మూడో స్థానంలో కర్నూల్, నాలుగో స్థానంలో అయిజ మండలం, పులికల్ జట్టు నిలిచింది. విజేతలకు మొదటి బహుమతిగా రూ. 30,116, రెండో బహుమతిగా రూ. 20,116, మూడో బహుమతిగా రూ. 10,116, నాలుగో బహుమతిగా రూ. 5,116 నగదును ఆలయ కమిటీ నిర్వాహకులు అందజేశారు.