మహబూబ్నగర్, ఫిబ్రవరి 1: ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మహబూబ్నగర్ జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషిచేస్తానని కలెక్టర్ జీ రవి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. అందరి సహకారంతో జిల్లాను ముందుకు నడిపిస్తామని, తాను మహబూబ్నగర్ జిల్లాకు కొత్త అయినప్పటికీ అన్ని విషయాలను తెలుసుకొని ముందుకు సాగుతానని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాకు కలెక్టర్గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, సీఎస్, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురు ఉద్యోగులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ రవి ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
వనపర్తి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా కలెక్టర్గా తేజస్ నందలాల్పవార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కలెక్టర్కు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లా లో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ప్రతి అధికారి కృషిచేయాలన్నా రు. కార్యక్రమంలో డీఆర్డీవో నర్సింహులు, డీపీవో సురేశ్, వ్యవసాయాధికారి సుధాకర్రెడ్డి, సివిల్ సప్లయి అధికారి కొండల్రావు, డీసీఎస్వో సుదర్శన్, ఎఫ్డీవో రెహమాన్, డీడబ్ల్యూవో క్రాంతి, డీఈవో రవీందర్, క్రీడల అధికారి అనిల్కుమార్, డీపీఆర్వో రషీద్, డీఎంహెచ్వో రవిశంకర్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి నుషిత తదితరులు పాల్గొన్నారు.