మహబూబ్నగర్, జనవరి 24 : విద్యార్థు లు ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని ముం దుకు అడుగులు వేయాలని, ఎలాంటి ప్ర లోభాలకు గురికావొద్దని కలెక్టర్ వెంకట్రా వు పేర్కొన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో మం గళవారం సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జరీనాబేగం, చైల్డ్ వె ల్ఫేర్ కమిటీ చైర్మన్ నయీముద్దీన్, జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్వో భా స్కర్నాయక్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్, జీసీడీవో పల్లవి, ఎస్సీడీపీపీవో సంధ్యారాణి ఉన్నారు.
నేడు బైక్ ర్యాలీ
బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లాకేంద్రంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పాలకొండ స మీపంలోని కలెక్టరేట్ నుంచి జెడ్పీ మైదా నం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. జెడ్పీ కార్యాలయంలో మధ్యాహ్నం 1:10 గంటలకు ప్రతిజ్ఞ ఉంటుందని, అనంతరం సీనియర్ సిటిజన్లకు సన్మానం, పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామన్నారు.
ఆల్ఫైజ్ ఆధ్వర్యంలో..
మహబూబ్నగర్టౌన్, జనవరి 24: ఆల్ఫైజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రాజేందనగర్లో మంగళవారం బాలికల దినోత్స వం నిర్వహించారు. ఈ సందర్భంగా సొ సైటీ అధ్యక్షుడు జహంగీర్బాబా విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. బాలికలు అ న్ని రంగాల్లో రాణించాలన్నారు.
విద్యార్థులకు క్విజ్ పోటీలు
పాలమూరు, జనవరి 24: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఆర్వీఎం సమావేశ మందిరంలో జిల్లాస్థా యి విద్యార్థులకు మంగళవారం వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. జూనియర్ విభాగంలో ఎన్నికల ప్రక్రియ లో గుణాత్మక మార్పు’ అనే అంశంపై, సీనియర్స్ విభాగంలో ‘భారతీయ ప్రజాస్వామ్యం-ప్రజాస్వామ్య పటిష్టతలో యువత పాత్ర’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు డీఈవో రవీందర్ బహుమతు లు అందజేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సమన్వయ అధికారి బాలుయాదవ్, సాంఘిక ఫోరం అధ్యక్షుడు చెన్నప్ప, శ్రీనివాస్, మోహన్రెడ్డి, కృష్ణారెడ్డి, ఇబ్రహీం, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
బాలానగర్, జనవరి 24 : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్ అన్నారు. మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం-1లో బాలికా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అనిత, టీచర్లు కమల, జరీనాబేగం, పంచాయతీ కార్యదర్శి జగన్, తదితరులున్నారు.
కోడ్గల్ జెడ్పీహెచ్ఎస్లో..
జడ్చర్ల, జనవరి 24: మండలంలోని కోడ్గల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలికలకు కరాటే శిక్షణ
నవాబ్పేట, జనవరి 24: మండలంలోని మరికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బా లికలకు మంగళవారం కరాటే శిక్షణ శిబిరా న్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశానుసా రం బాలికల స్వీయరక్షణ కోసం కరాటే మాస్టర్ చెన్నయ్య కరాటే తరగతులను ప్రా రంభించారు. కార్యక్రమంలో హెచ్ఎం సరస్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మిడ్జిల్లో..
మిడ్జిల్, జనవరి 24 : బాలికలు తమ హ క్కులను సద్వినియోగం చేసుకోవాలని ఐ సీడీఎస్ సూపర్వైజర్ కల్పన అన్నారు. మండలకేంద్రంతోపాటు వస్పుల్, మంగ ళాగడ్డతండా, బోయిన్పల్లి, చిల్వేర్ గ్రామా ల్లో మంగళవారం బాలికల దినోత్సవం ని ర్వహించారు. ఈ సందర్భంగా వారు వి ద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్య క్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థినికి కలెక్టర్ ప్రశంశ
పాలమూరు, జనవరి 24: జాతీయ బాలిక ల దినోత్సవం సందర్భంగా నిర్మల్లో ని ర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ పోటీల్లో అ పెక్స్ సెంట్రల్ స్కూల్ విద్యార్థిని మహవిష్ మనాల్ రెండో బహుమతి సాధించింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు విద్యా ర్థిని అభినందించారు.