మహబూబ్నగర్/పాలమూరు, జనవరి 25 : సమసమాజ నిర్మాణానికి ఓటే వజ్రాయుధమని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాల యం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. దేశంలో నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య ఎన్నికలను ప్రపంచ దేశాలన్నీ పరిశీలిస్తున్నాయని, ఇది ప్రతిఒక్కరికీ గర్వకారణమన్నారు. ఓటరు అవగాహన, ఓటుశాతాన్ని పెంచేందుకుగానూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు అనేక సంస్కరణలు, కొత్త విధానాలను చేపడుతున్నాయన్నారు. గతంలో కేవలం 45శాతం మాత్రమే ఉన్న ఓటింగ్శాతం ఇప్పుడు 85నుంచి 90వరకు పెరిగిందని వివరించారు. అలాగే ఈవీఎంల ఏర్పాటుతో ఓట్ల లెక్కింపు సులభతరమైందన్నారు. 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా న మోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 6లక్షల 47వేల 384మంది ఓటర్లు ఉన్నారని, వీరందరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు. అలాగే ఇటీవల ఓటరుగా నమోదు చేసుకున్న యువతీయువకులకు గుర్తింపుకార్డులను పంపిణీ చేశారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, ఆర్డీవో అనిల్కుమార్, జెడ్పీ సీఈ వో జ్యోతి, అర్బన్ తాసిల్దార్ పార్థసారధి, ఆర్ఐలు నర్సింగ్నాయక్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు, జనవరి 25 : జాతీయ ఓటరు దినోత్సవా న్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ మండలంలోని కోడూరు, జమిస్తాపూర్, దివిటిపల్లి, కోటకదిర, మాచన్పల్లి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, తాసిల్దార్ పాండూనాయ క్, ఎంపీడీవో జ్యోతి, ఎంపీవో నరేందర్రెడ్డి, ఆర్ఐ క్రాంతికుమార్గౌడ్, డిప్యూటీ తాసిల్దార్ శ్యాంసుందర్రెడ్డి, సర్పంచులు శ్రీకాంత్గౌడ్, రాంచంద్రయ్య, జరీనాబేగం ఉన్నారు.
రాజాపూర్, జనవరి 25 : భారత రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కుపై అందరికీ అవగాహన ఉండాలని తాసిల్దార్ రాంబాయి అన్నారు. మండలకేంద్రంలో విద్యార్థులు, యు వకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏ ర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైస్ఎంపీ పీ మహిపాల్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, కోఆప్షన్ సభ్యుడు అల్తాఫ్, డిప్యూటీ తాసిల్దార్ భరత్కుమార్, ఆర్ఐ ఖదీర్, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, జనవరి 25 : కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తాసిల్దార్లు శివరాజు, సువర్ణరాజు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
దేవరకద్ర, జనవరి 25 : ఓటుహక్కు వజ్రంలాంటిదని తాసిల్దార్ జ్యోతి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సం దర్భంగా అన్ని గ్రామపంచాయతీల్లో ర్యాలీ నిర్వహించారు. 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ అబ్దుల్ రహెమాన్, ఆర్ఐ సురేశ్, ఎండీ జలీల్, శివ పాల్గొన్నారు.
బాలానగర్, జనవరి 25 :అర్హులైన ప్రతిఒక్కరూ ఓటుహక్కు పొందాలని తాసిల్దార్ శ్రీనివాసులు కోరారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అన్ని గ్రామపంచాయతీల్లో ఓటుహక్కుపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ఐ వెంకట్రెడ్డి, అంగన్వాడీ టీచర్లు కమల, జరీనాబేగం, సునీత పాల్గొన్నారు.
మూసాపేట, జనవరి 25 : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటుహక్కు పొంది సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని తాసిల్దార్ మంజుల కోరారు. మండలకేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఓటుహక్కుపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, ఎస్సై నరేశ్, డిప్యూటీ తాసిల్దార్ వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ మానస, ఎంపీవో సరోజ పాల్గొన్నారు.
హన్వాడ, జనవరి 25 : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తాసిల్దార్ శ్రీనివాసులు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ సతీశ్కుమార్, హెచ్ఎం భాస్కర్, ఎంఈవో రాజూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, జనవరి 25 : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంలో అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకానంద చౌరస్తాలో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తాసిల్దార్ ప్రేంరాజ్, ఎంపీడీవో జయరాం, సర్పంచ్ కృష్ణయ్య, హెచ్ఎం వెంకట్జీ, ఆర్ఐలు శంకర్, బురాన్, నాయకులు భీంరెడ్డి, రాజ్కుమార్, జగన్గౌడ్ పాల్గొన్నారు.
నవాబ్పేట, జనవరి 25 : మండలకేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, ఎంపీడీవో శ్రీలత, డిప్యూటీ తాసిల్దార్ లిఖితారెడ్డి, సర్పంచ్ గోపాల్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు తాహేర్, ఆర్ఐలు గోవర్ధన్, కిరణ్కుమార్, నాయకులు ప్రతాప్, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
మిడ్జిల్, జనవరి 25 : మండలకేంద్రంలో ఓటుహక్కుపై అవగాహన ర్యాలీ కల్పించారు. అనంతరం ప్రధానరహదారిపై మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజీవ్రెడ్డి, ఎంపీడీవో సాయిలక్ష్మి, డిప్యూ టీ తాసిల్దార్ గీత, ఎంపీవో అనురాధ, ఆర్ఐ రామాంజనేయులు, ఎంపీటీసీ గౌస్, హెచ్ఎం రవికుమార్, వెంకట్రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల, జనవరి 25 : జాతీయ ఓటరు దినోత్సవాన్ని జడ్చర్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్చౌరస్తాలో ప్ర తిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్లు వెంకటేశ్వరి, మహబూబ్అలీ, ఆర్ఐ రాఘవేంద్ర, సీనియర్ అసిస్టెంట్ రవిశంకర్, ఇన్చార్జి హెచ్ఎం వివేకానంద, భాను, వీఆర్ఏలు ఆంజనేయులు, శ్రీను, పవన్ పాల్గొన్నారు.