మహబూబ్నగర్/పాలమూరు, ఫిబ్రవరి 15: గ్రూప్ పోటీ పరీక్షలకు హాజరువుతున్న అభ్యర్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ రవినాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో బు ధవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో గ్రూప్ 2, 3, 4 అభ్యర్థులకు 3నెలల స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ ఉచిత శిక్షాణా కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలమూరు ఎస్సీ, ఎస్టీ సర్కిల్ ఆధ్వర్యంలో 2015 నుంచి ఇప్పటివరకు ఉచిత కోచింగ్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాలకు పేద, మధ్య తరగతి విద్యార్థులు మాత్రమే వస్తారన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అ భ్యర్థులు ఏడాది పాటు కష్టపడి చదివి ఉన్నత స్థానాన్ని పొం దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సం క్షేమ అధికారులు, ఎస్సీ, ఎస్టీ సర్కిల్ డైరెక్టర్స్ పాల్గొన్నారు.
బాధ్యుల నియామకం
మహబూబ్నగర్, ఫిబ్రవరి 15 : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంబంధింత అధికారులకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారిగా స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, వెబ్కాస్టింగ్ వీడియోగ్రఫీ నోడల్ ఆఫీసర్గా డీఐజీ సత్యనారాయణమూర్తి, ఈడీఎం చంద్రశేఖర్, డిస్టిబ్యూషన్ సెంటర్ నో డల్ అధికారిగా ఆర్డీవో అనిల్కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్ర దీప్కుమార్, ట్రాన్స్పోర్ట్మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా పశు సంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ వెంకటేశ్వర్లు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నో డల్ అధికారిగా డిప్యూటీ సీఈవో మొగులప్ప, మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి మ ధుసూదన్గౌడ్, బ్యాలెట్ బాక్స్ నో డల్ అధికారిగా డీపీవో బి.వెంకటేశ్వర్లు, ఏంసీసీ నోడల్ అధికారిగా జెడ్పీ సీఈవో జ్యోతి, అబ్జర్వర్ నోడల్ అధికారిగా జిల్లా ఎక్సైజ్ ఈఎస్ సైదులు, లా అండ్ ఆర్డర్ నోడల్ అధికారిగా అడిషనల్ ఎస్పీ రాములు, కంప్యూటరైజేషన్ నోడల్ అధికారిగా డీఐవో మూర్తి, హెల్ప్లైన్, ఫిర్యాదుల పరిష్కా రం సెల్ నోడల్ అధికారిగా సీపీవో దశరథం, నోడల్ హెల్త్ అధికారిగా జిల్లా ఆడిట్ ఆఫీసర్ శ్యాంసుందర్ ప్రసాద్, జి ల్లా కో-ఆపరేటివ్ అధికారిగా సుధాకర్, క్యాష్ సీజర్, కమిటీసభ్యులుగా జెడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా ఆడిట్ అఫీసర్గా ట్రెజరీ అధికారి కోమలి, మ్యాన్పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా ఆర్డీవో, కలెక్టరేట్ ఏవో, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నోడల్ అధికారిగా జిల్లా పౌరసంబంధాల అధికారి యు.వెంకటేశ్వర్లను నియమించారు.
సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి
గండీడ్, ఫిబ్రవరి 15 : ప్రజలు మత సమస్యలతో సతమతమై తమను సంప్రదించినప్పుడు అధికారులు బాధ్యతగా వ్యవహరించి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారాకి కృషి చేయాలని కలెక్టర్ రవినాయక్ సూచించారు. గండీడ్ తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రికార్డు రూంతోపాటు గదులు, కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో రూపేందర్ తదితరులున్నారు.