అచ్చంపేట రూరల్, జూలై 11 : పట్టణంలోని ఎంఐఎస్ (సివిల్ సప్లయి) గో దాంలో 515 బస్తాల్లో 25.750 క్వింటా ళ్ల దొడ్డు బియ్యం ముక్కిపోతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక మార్కెట్ ఆవరణలో ఉన్న సివిల్ సప్లయి గో దాం లో కొంత కాలంగా దొడ్డు బియ్యం బస్తాలు నిల్వ ఉన్నాయి. పేదలకు పంపిణీ చే యాల్సిన బియ్యం పందికొక్కులు, ఎలుకలకు ఆహారంగా మారడంతోపాటు ము క్కిపోతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు సన్నబియ్యం పథకం ప్రవేశ పెట్టక ముందు రేషన్ దుకాణాల్లో దొడ్డు బి య్యాన్ని పంపిణీ చేసేవారు. సన్న బి య్యం పథకం ప్రవేశపెట్టిన తర్వాత గో దాంలలో మిగిలిన దొడ్డు బియ్యాన్ని ప్ర భుత్వం సకాలంలో టెండర్ వేయాల్సి ఉన్నది. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాల్సి ఉ న్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రా ష్ట్ర వ్యాప్తంగా గోదాంలలోనే దొడ్డు బియ్యం పాడైపోతోంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందని, ఇప్పటికైనా రేవంత్ సర్కారు మేల్కొని గోదాంలలోని దొడ్డు బియ్యాన్ని టెండర్ వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.