గోపాల్పేట, ఆగస్టు 22: మండలంలోని ఏదుల గ్రామం మండలంగా మారనుంది. మండల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని చెన్నారం, చీర్కపల్లి గోపాల్పేట మండలంలోని ఏదుల, నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకులపల్లి 8గ్రామాలు కలిసి నూతన మండలంగా ఏర్పాటు కానుంది. మండల ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి నిరంజన్రెడ్డితోపాటు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, బాల్రెడ్డి, రమేశ్, సునీల్ ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ నరేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నెరవేరిన ఏదుల వాసుల కల
వనపర్తి, ఆగస్టు 22: ఏదుల గ్రామస్తులు తమ గ్రామం మండలంగా మారాలని ఓ కలగా ఉండేదని అటువంటి కల నిజమైందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. రేవల్లి మండలంలోని చెన్నారం, చీర్కపల్లి, గోపాల్పేట మండలంలోని ఏదుల, కోడేర్ మండలంలోని సింగాయపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకులపల్లితో కలిసి ఏదుల మండలంగా రూపుదిద్దుకుందన్నారు. మండల ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్కు మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతున్నట్లు తెలిపారు.