జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. అన్ని గ్రామాలు, తండాల నుంచి ప్రజలతో కలిసి ప్రత్యేక వాహనాల్లో పాలమూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జై కేసీఆర్..జైజై తెలంగాణ నినాదం మార్మోగింది. అదేవిధంగా ఆటోలు, ద్విచక్రవాహనాలపై ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో పాలమూరు జిల్లా గులాబీమయంగా మారింది.