హన్వాడ, నవంబర్ 18 : విద్యతోనే బాలికా వికాసం కలుగుతున్నదని, ఇప్పటికే బాలికలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవా రం హన్వాడ మండలం పల్లెమోని తం డా వద్ద ఏర్పాటు చేసిన వేపూర్ బీసీ బా లికల గురుకుల విద్యాలయాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో హన్వాడ మండలంలో బాల్యవివాహా లు జరిగేవని తెలిసి ఎంతో బాధపడ్డాన ని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎం తో మార్పు వచ్చిందని, భవిష్యత్లో బా ల్యవివాహాలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలురతో సమానంగా బాలికలు చదువులో ప్రతిభ చాటుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు నుంచి ఎవరెస్ట్ శిఖరం ఎక్కే స్థాయికి మన విద్యార్థినులు చేరుకున్నారని ఆనం దం వ్యక్తం చేశారు.
పేదరికం కారణంగా విద్యకు దూరమవుతున్న బాలికలకు చ క్కని విద్య అందిస్తే అత్యున్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. బాలికల వి ద్యను ప్రోత్సహించి వారు జీవితంలో ఉ న్నత స్థాయికి చేరుకునేలా తమ వంతు కృషి చేస్తామని వివరించారు. వెనుకబడిన హన్వాడకు రెండు బీసీ, ఎస్సీ గురుకులం, కస్తూర్బా విద్యాలయాన్ని ఏర్పా టు చేశామన్నారు. నెల రోజుల్లో హన్వా డ మండల కేంద్రంలో బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని పే ర్కొన్నారు. త్వరలో స్టేడియం నిర్మాణం సైతం చేస్తామని చెప్పారు. హన్వాడ మండలానికి మంజూరైన ఫుడ్పార్క్తో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చె ప్పారు. నూతనంగా ఏర్పాటు కానున్న హైవేతో హన్వాడ నుంచి హైదరాబాద్ వంటి నగరాలకు చేరుకోవడం మరింత సులభమవుతుందని చెప్పారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం తపించే గొప్ప నేత మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ప్రజల సహకారంతో మరిన్ని శి ఖరాలు అధిరోహించాలని కాంక్షించా రు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్లో భా గంగా హన్వాడ మండలం కారంతండా కు చెందిన దివ్యాంగుడు హరియా నా యక్కు స్కూటీని మంత్రి అందజేశారు. అలాగే దస్తగిరి దర్గా వద్ద రూ.5 లక్షలతో నిర్మించనున్న కిచెన్షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వంద మంది బీజే పీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆ ర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, బీసీ సంక్షే మ శాఖ కార్యదర్శి మల్లయ్య బట్టు, ఎంపీడీవో ధనుంజయ, తాసిల్దా ర్ శ్రీనివాసులు, ముడా డైరెక్టర్ బాల య్య, సింగిల్ విండో చైర్మన్ వెంకట య్య, పార్టీ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, ప్రిన్సిపాల్ రవి ప్రకాశ్, నాయకులు కృష్ణయ్యగౌడ్, రాజు ఉన్నారు.