రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ కవితను ఈడీ తో అరెస్ట్ చేయించడంపై ఉమ్మడి పాలమూరు జిల్లా భ గ్గుమన్నది. దేశ సంక్షేమం కోసం గొంతెత్తుతున్న గులాబీ బాస్ కేసీఆర్ను ధైర్యంగా ఎదుర్కోలేక కేంద్రంలో ప్రతిపక్షం, అధికారపక్షంగా ఉన్న కాంగ్రె స్, బీజేపీలు తెలంగాణలో ఒక్కటై బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని రాస్తారోకోలు, ధర్నాలతో శనివారం నిరసన తెలిపారు.
బీజేపీకి ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేక ప్ర భుత్వ సంస్థలను పావుగా వాడుకొని అక్రమంగా అరెస్టు లు చేయిస్తున్నదని దుయ్యబట్టారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ పక్కా ప్లాన్తోనే చేశాయంటూ ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ కవితను కావాలనే ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చె ప్పడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో పె ద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. వెంటనే కవితపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.