వడ్డేపల్లి, జనవరి 30 : సామాన్యుడి చెంతకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. శాంతినగర్లో రూ.16లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను మున్సిపల్ చైర్పర్సన్ కరుణతో కలిసి ఎమ్మె ల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3లక్షల సహాయం అందించేందుకు ప్రభుత్వం కరసత్తు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రజితమ్మ, కౌన్సిలర్లు మాణిక్యం రవి, లలితమ్మ, ధనలక్ష్మి, ఆంజనేయులు, నాయకులు అజయ్కుమార్, శ్రీనివాసులుగౌడ్, పూర్ణచంద్రరావు, రవిరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, తోటరవి, డాక్టర్ సోఫియా, సీహెచ్వో షబ్బీర్ హుస్సేన్, వైద్యబృందం పాల్గొన్నారు.
మానవపాడు, జనవరి 30: ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు వి మర్శలు చేస్తున్నాయని ఎమ్యెల్యే అబ్రహం పే ర్కొన్నారు. మండలంలోని అమరవాయి, క లుకుంట్ల గ్రామాల్లో నేషనల్ హెల్త్మిషన్ ని ధులతో నిర్మించిన పల్లె దవాఖానలను ఎమ్యె ల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.11లక్షలు మం జూరయ్యాయని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల దవాఖానను మూడునెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో అమరవాయి మాజీ సర్పంచ్ కాంతారెడ్డి, ఎంపీటీసీ రోషన్న, ప్రకాశ్గౌడ్, కలుకుం ట్ల సర్పంచ్ ఆత్మలింగారెడ్డి, డాక్టర్ ఇర్షాద్, రి జ్వాన, నాగేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.