అయిజ, ఫిబ్రవరి 17 : ఉత్తనూర్ ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బాస్కెట్బాల్ టోర్నీ కొనసాగింది. క్వార్టర్ ఫైనల్లో 6 మహిళా జట్లు, 12 పురుషుల జట్లు పాల్గొనగా ఆదివారంతో పోటీలు ముగుస్తాయని టోర్నీ కార్యదర్శి కొట్టం నీలిమ తెలిపారు.
పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన బాస్కెట్బాల్ క్రీడాకారులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ కోచ్ నయీముద్దీన్, రెఫరీలు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.