మక్తల్ టౌన్, డిసెంబర్ 4 : మండలంలో నిర్మించిన అ య్యప్పస్వామి ఆలయం నేటికీ ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆ దివారం వార్షికోత్సవ కార్యక్రమాన్ని గురుస్వామి అనిల్గౌ డ్ సమక్షంలో కనులపండుగగా నిర్వహించారు. స్వామి వా రికి అభిషేకం, హోమం, లక్షపుష్పార్చన, మహామంగళహారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్వాములు, భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కా ర్యర్రమంలో గురుస్వాములు అనిల్, శివరాం, అనిల్గౌడ్, శంకర్, నీలగౌడ్, రంజిత్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
ఉప్పర్పల్లిలో..
మండలంలోని ఉప్పర్పల్లి అయ్యప్పస్వామి ఆలయం లో షెడ్ నిర్మాణానికి ఆదివారం గురుస్వామి శ్రీధర్గౌడ్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ
ఊట్కూర్, డిసెంబర్ 4 : అయ్యప్ప మహా పడిపూజ కా ర్యక్రమాన్ని మండలంలోని బిజ్వారం అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం ఆశ్రమంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో స్వాములు ఘనంగా నిర్వహించారు. దుర్గామాత భక్తుడు ఆదిత్య పరా శ్రీ ఆధ్వర్యంలో పాలు, పండ్లు, పంచామృతం, తేనె, చంద నం, సుగంధ ద్రవ్యాలతో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజ లు, అభిషేకం చేశారు. ఘనంగా మెట్ల పూజ నిర్వహించా రు. పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించగా అయ్యప్ప మా లధారణ స్వాముల కీర్తనలతో గ్రామం పులకించిపోయింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కా ర్యక్రమంలో వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు, భక్తు లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు
నారాయణపేట రూరల్, డి సెంబర్ 4 : మండలంలోని అ ప్పిరెడ్డిపల్లి లక్ష్మణ్ గురుస్వామి స్వగృహంలో ఆదివారం అయ్యప్పస్వామి మహా పడిపూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వాములు పాడిన పాటలతో ఈ ప్రాంతమంతా అయ్య ప్ప నామస్మరణతో మార్మోగిం ది. సర్పంచ్ ప్రభావతి, ఎంపీటీ సీ జయమ్మ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్వాములకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.