వనపర్తి / కొత్తకోట , మార్చి 26 : ఆత్మీయ సమ్మేళనాలు ప్రభంజనాన్ని తలపిస్తున్నాయి.సమావేశాలు జరిగే ప్రతిచోటా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయా పట్టణాలు గులాబీమయంగా మారాయి. కొత్తకోటలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు.. ఆటపాటలు ఆకట్టుకుంటున్నాయి. కళాకారులు, మహిళల బొడ్డెమ్మలు.. బతుకమ్మలు అలరించాయి. కొత్తకోట, వనపర్తిలో జరిగిన సమావేశాలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి హాజరయ్యారు. అలాగే మల్దకల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అలంపూర్ నియోజకవర్గంలోని సంకాపురంలో ఎమ్మెల్యే అబ్రహం, మరికల్లో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, వీపనగండ్ల మండలం పుల్గర్చర్లలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆకలి కేకల నుంచి నేడు తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందని చెప్పారు. రాష్ట్రంలోని సంక్షేమం, అభివృద్ధితో ప్రజలకు ప్రభుత్వంపై ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు.
ఉమ్మడిరాష్ట్రంలో ఆకలికేకలతో విలవిలలాడి న తెలంగాణ స్వరాష్ట్ర పాలనలో సీఎం కే సీఆర్ నాయకత్వంలో అన్నపూర్ణగా అవతరించిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కొ త్తకోట పట్టణంలోని బీవీఆర్ గార్డెన్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజలలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. తెలంగాణ వ చ్చాక ఏం సాధించుకున్నామో గుర్తు చే సుకునేందుకే ఆత్మీయ సమ్మేళనాలు ని ర్వహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు ఊహించని దాని కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి కండ్లముందు ఉంచామన్నారు. కాళేశ్వరం నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో తెలంగాణ దేశానికే అ న్నపూర్ణగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం కే సీఆర్ను విపక్షాలు ప్రతి రోజూ తిడుతూ ఓటేయాలని అడుగుతున్నారని, కానీ ప్ర జలకు కేసీఆర్ కన్న ఎక్కువగా ఏం చేస్తా రో చెప్పడం లేదన్నారు. కరువుతో తం డ్లాడిన తెలంగాణ నేడు ఎటు చూసినా పచ్చబడిందని, ఎనిమిదేండ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని.. వారి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీకే ఉంటాయని మంత్రి తెలిపారు. దేశంలో తెలంగాణతో పోటీగా నిలిచే రాష్ట్రం మరోటి లేదని మంత్రి వివరించారు.
అంబానీ బాగుండాలన్నదే మోదీ లక్ష్యం: ఎమ్మెల్యే ఆల
దేశ ప్రజలు ఎటుపోయినా సరే.. తాను.. తన దోస్త్ అంబానీ బాగుండాలన్నదే ప్ర ధాని మోదీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఆదిశగా దేశం లో ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారని ఘాటుగా విమర్శించారు. కొత్తకోటతోపాటు 7 జీపీల కార్యకర్తలతో కలి సి పట్టణంలోని బీవీఆర్ ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి మాట్లాడారు. మోదీ 2014 నుంచి నేటి వరకు తెలంగాణకు ఒక్క మంచి పనైనా చేశా రా? నల్లధనం తీసుకొచ్చి ప్రతిఒక్కరి అ కౌంట్లో రూ.15లక్షలు వేస్తామన్న మో దీ.. బీజేపీ జెండాలు మోస్తున్న కార్యకర్తలకైనా డబ్బులు వేశారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పక్క రాష్ర్టాల బీజేపీ నాయకులకు తెలంగాణ సంక్షేమం కనిపించి నా.. ఇక్కడి నాయకులకు కండ్లకు మా త్రం కనిపించడంలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, వైస్ చైర్పర్సన్ జయమ్మ, సింగిల్విండో చైర్మ న్ వాసుదేవారెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, బాబు, ఉమ్మడిజిల్లాల అధికార ప్ర తినిధి ప్రశాంత్, సర్పంచ్ శ్రీను, మండ ల ప్రధానకార్యదర్శి బాలకృష్ణ, నాయకు లు బాలకృష్ణ, కొండారెడ్డి, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సహపంక్తి భోజనం
కొత్తకోట పట్టణంలోని బీపీఆర్ గార్డెన్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం క నీవినీ ఎరుగని రీతిలో జరిగింది. కనిమె ట్ట, రామనంతాపురం, పాలెం, నిర్వేన్, కానాయపల్లి, ఈదులబాయితండాతోపాటు కొత్తకోట పట్టణంలోని 15 వార్డులకు చెందిన మహిళలు, పార్టీ నేతలు త రలివచ్చారు. కళాకారులు, మహిళలు బొడ్డెమ్మలు బతుకమ్మతో తరలిరావడం తో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొన్నది. కనిమెట్ట నుంచి ఎమ్మెల్యే ఆల సతీమణి మంజుల, ఎంపీపీ గుంతమౌనిక తో కలిసి డప్పులు, వాయిద్యాల మధ్య ఊరేగింపుగా సభకు చేరుకున్నారు. అం తకుముందు చౌరస్తాలో బీఆర్ఎస్ జెం డాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. 210 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆ ల పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌ డ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జయమ్మ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, విండో చైర్మన్ వాసుదేవారెడ్డి, ఉమ్మడి జి ల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఆకు ల శ్రీను, వైస్ఎంపీపీ శ్రీను, మార్కెట్ చైర్మన్ శ్రావణ్రెడ్డి, ఉపాధ్యక్షుడు యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.
చంటి బిడ్డతో సమ్మేళనానికి..
సీఎం కేసీఆర్పై ఉన్న ప్రేమతో ఎండ సైతం లెక్క చేయకుండాతన చంటి బిడ్డను ఎత్తుకొని ఆదివారం కొత్తకోటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. 5 వేల మంది గులాబీ పార్టీ కుటుంబ సభ్యులు హాజరవగా.. అందులో సగం మంది మహిళలే ఉండటం విశేషం.సభలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాట్లాడుతుండగా అప్పరాల గ్రామానికి చెందిన పద్మ తన చంటి బిడ్డ వేదాంతితో కనిపించగా.. చిన్నారితో ఎందుకొచ్చావమ్మా..? అని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిపై ఉన్న ప్రేమతో సమ్మేళానికి వచ్చానని ఆమె సమాధానం చెప్పడంతో సభ కరతాళధ్వనులతో మార్మోగింది.