మహబూబ్నగర్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరుకు 4వ తేదీన సీఎం కేసీఆర్ వస్తున్నారని, పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించా రు. శుక్రవారం సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. స మావేశం వేదిక, పబ్లిక్ కూర్చొనేందుకు చేస్తున్న ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. వ్యూ బాగా కనపడేలా స్టేజీని ఏర్పాటు చేయాలన్నారు. స్టేజీ వె నుక భాగంలో ఏర్పాటు చేస్తున్న బ్యాన ర్, డిజిటల్ స్క్రీన్లు దూరంలోని జనాని కి కనిపించేలా కనపడేలా చూడాలన్నా రు.
అక్కడక్కడ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని.. అక్కడి నుంచే వీక్షించేందు కు వీలుగా ఉంటుందన్నారు. పబ్లిక్ రా వడానికి కావాల్సిన ఎంట్రీ పాయింట్లు అన్నీ సభకు త్వరగా చేరుకునేలా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు, మం త్రులు, సీఎం ఇతరులు ప్రవేశించే ఎం ట్రీ పాయింట్లు స్టేజీకి దగ్గరలో ఏర్పా టు చేయాలని ఆదేశించారు. వీఐపీలు, టీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నేతలు వచ్చేందు కు వీలుగా ఎంట్రీ ఉండాలని సూచించా రు. జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు భారీగా జనం వస్తున్నందు న అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు, పార్కింగ్కు ఇ బ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చే యాలని పోలీసులకు సూచించారు. జి ల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ ప్రారంభంతోపాటు ఎంవీఎస్ కళాశాలలో జరిగే బహిరంగ సభ ఏ ర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే మం త్రులు, ఎమ్మెల్యేలు భారీగా జనసమీకరణ చేసే పనిలో ఉన్నారని తెలిపారు. క నీవినీ ఎరుగని రీతిలో సభ విజయవం తం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని టోల్ప్లాజా సమీపంలో తొలి డిజిటల్ స్క్రీన్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధిని ఈ స్క్రీన్లో నిక్షిప్తం చేస్తారని తెలిపారు. గతంలో పాలమూరు ఎలా ఉందో.. ప్రస్తుత పరిస్థితులు జనానికి అర్థమయ్యేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం మెట్టుగడ్డ వద్ద జరుగుతున్న రహదారి పనులను మంత్రి పరిశీలించారు. 24 గంటల్లోపు పనులను పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, పీఏసీసీఎస్ చైర్మన్ ప్రశాంత్ భాస్కర్, శ్రీకాంత్గౌడ్, శ్రీకాంతాచారి, శశికిరణ్గౌడ్, నాయకులు ఉన్నారు.