నారాయణపేట టౌన్, జనవరి 6 : పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని బాపునగర్లో ఉన్న చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశా రు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టి పంచామృతాభిషేకం, హోమం, మహామంగళహారతి, తీర్థప్రసాద వితర ణ చేశారు. భక్తులు గీతాబాయి సుదర్శన్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి నారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలో ని షిర్డీ సాయి హనుమాన్ టెంపుల్ మందిరంలో కమిటీ స భ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
నారాయణపేట రూరల్, జనవరి 6 : మండలంలోని జాజాపూర్లో చౌడేశ్వరి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం దేవాంగ సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. అ మ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, మ హామంగళహారతి, యజ్ఞం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాంగ సమా జం సభ్యులు, మహిళలు, యువకులు, చి న్నారులు పాల్గొన్నారు.
ఊట్కూర్, జనవరి 6 : మండలంలోని బిజ్వారం అంబత్రయ క్షేత్రంలో గల త్రిశక్తి పీఠంలో శుక్రవారం సహస్త్ర చం డీ యాగం వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ నగరాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని త్రిశక్తి పీఠాన్ని దర్శించుకున్నారు. పౌర్ణమి సం దర్భంగా పలువురు దంపతులు పాల్గొని హో మం నిర్వహించారు. లోక కల్యాణార్థమై, జగన్మాత ప్రీతి కోసం సహస్ర చండీయాగం నిర్వహించినట్లు త్రిశక్తి పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ తెలిపారు. కార్యక్రమంలో రాజేశ్, వెంకటేశ్, మూర్తి, ఆంజనేయులు పాల్గొన్నారు.
దామరగిద్ద, జనవరి 6 : మండలంలోని కా ర్యతన్పల్లి వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం వంద మందికి పైగా శివ భక్తులు శి వ మాలధారణ వేశారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములు, భక్తులకు మద్దూర్ గ్రా మానికి చెందిన శివకుమార్, బసిలింగమ్మ దంపతులు అ న్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల య కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.