అలంపూర్, ఫిబ్రవరి 12 : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ ఆలయాలను ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి సో మవారం దర్శించుకున్నారు. జోగుళాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ఆయనకు దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనతోపాటు ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అ నంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అం దించి ఆశీర్వచనం పలికారు. కార్యక్రమంలో ఆల య ధర్మకర్తలు, అర్చకులు ఉన్నారు.