పాలమూరు, ఫిబ్రవరి 4 : మండలంలోని బొక్కలోనిపల్లి గ్రామ శివారులో జయప్రకాశ్ నారాయణ ఇంజినీరిం గ్ కళాశాలలో శనివారం ఇంటర్ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ హాజరయ్యారు. కళాశాలలో జయప్రకాశ్ నారాయణ, మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజ నిర్మాణం లో ఇంజినీర్ల పాత్ర కీలకమని, ఇంజినీర్లు సమాజ అవసరాలను తీరుస్తారని అన్నారు. ఇంజినీర్లు లేనిదే ప్రపంచం లేదని, ఎంపీసీ చదివిన వారు భావితరాల్లో ఇంజినీర్లుగా అవుతారన్నారు.
విజయం సాధించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇంజినీరింగ్ చ దివితే సమాజంలో సమస్యలను తీర్చడానికి తోడ్పడుతార ని తెలియజేశారు. ఇంజనీరింగ్లో ప్రతి కోర్సు ముఖ్యమన్నారు. విద్యార్థులు సాధ్యమైనంత వరకు మొబైల్స్కు దూ రంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రముఖ వక్తలు సీబీఐటి కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి, ఫ్రీలా న్స్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ రమేశ్ విప్పర్తి, కళాశాల చైర్మన్ రవికుమార్ ఇంజినీరింగ్ గురించి విద్యార్థులకు వివరించా రు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.సుజీవన్కుమా ర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.చంద్రశేఖర్, సందీప్కుమార్, స్విట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుధాకర్, కళాశాల డైరెక్టర్ వెంకరామారావు, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.