పెంట్లవెల్లి, డిసెంబర్ 22 : ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యవసాయ కూలీ మృతి చెం దిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రామేశ్వర్రెడ్డి కథనం మేరకు మండలంలోని కొండూరుకు చెందిన రాజు(40) బుధవారం ఉదయం అదే గ్రామానికి చెందిన రైతు చిన్న కృష్ణారావు చెందిన వ్యవసాయ బావిలో మోటర్ మరమ్మతు చేయడానికి మరో ఇద్దరి కూలీలతో కలిసి వెళ్లి బావిగడ్డపై మోటర్కు సంబంధించిన పైపులను తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలోపడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.