యాసంగిలో జోరుగా వరి సాగైంది. ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా సాగునీరు.. నిరంతర విద్యుత్తో గతేడాదికంటే ఈసారి అధికంగా రైతులు పండించారు. ప్రస్తుతం పంట కోత దశకు రావడంతో కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో నాగర్కర్నూల్ జిల్లాలో 220 కేంద్రాల్లో 2.30 లక్షల మెట్రిక్ టన్నులు, పాలమూరులో 192 కేంద్రాల్లో 2 లక్షలు, జోగుళాంబ గద్వాలలో 74 కేంద్రాల్లో 1.77 లక్షలు, వనపర్తిలో 250 కేంద్రాల్లో 4 లక్షలు, నారాయణపేట జిల్లాలో 105 కేంద్రాల్లో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా సివిల్ సప్లై అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 841 కేంద్రాలను ఏర్పాటు చేసి 12.57 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రైతులకు మద్దతు ధర లభించనున్నది ప్రభుత్వ నిర్ణయంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయిస్తామని సంతోషంగా చెబుతున్నారు.
కల్వకుర్తి, ఏప్రిల్ 12 : ధాన్యం కొనుగోళ్ల విషయం లో కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నా.. రాష్ట్ర సర్కార్ రైతుల పక్షాన నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. యాసంగిలో రైతులు సాగుచేసిన ధాన్యాన్ని మరోసారి కేంద్రం కొనుగోలు చేయమని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇందుకు కా ర్యాచరణ సిద్ధం చే సుకోవాలని సీ ఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టా రు. మార్కెట్కు ధాన్యం వస్తున్న క్రమంలో దళారుల చేతుల్లో రైతులు మోసపోకూడదన్న ఉద్దేశంతో ముందస్తుగానే కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ కారం చుట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉమ్మడి జిల్లా అధికారులు సమావేశాలు నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు సమకూర్చ డం, ధాన్యం నిల్వ, గోదాంలు తదితర అంశాలపై చర్చించారు. యాసంగిలో ఎన్ని మెట్రిక్ టన్నుల ధా న్యం సేకరించాలి..? అనే అంశాలపై అవగాహనకు వ చ్చారు. ధాన్యం కొనుగోళ్లను ప్రాథమిక వ్యవసాయ స హకార సంఘాలు, ఐకేపీ, మండల మహిళా సమాఖ్య లు, మెప్మా, వ్యవసాయ మార్కెట్లు చేపట్టనున్నాయి.
గత ఇబ్బందులను తొలగించేలా..
యాసంగి కోతల సమయంలో సహజంగానే అకాల వర్షాలు కురుస్తాయి. దీంతో కల్లాల్లో, కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద కవర్లు సిద్ధం గా ఉంచనున్నారు. ధాన్యం తడవకుండా సకాలంలో గోదాంకు చేర్చడం వంటి వాటిపై దృష్టి సారించారు. గత యాసంగిలో ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగో లు కేంద్రాల వద్దకు వచ్చింది. రైస్మిల్లులు, గోదాంలు నిండిపోయాయి. ధాన్యం నిల్వ చేయడంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు వ్యూహంతో పనిచేస్తున్నారు.
వారంలోగా ఖాతాల్లోకి డబ్బులు..
వానకాలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాల్లో ధాన్యం విక్రయించిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. దీంతో నూటికి నూరు శాతం రైతులు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించే అవకాశాలు ఉన్నాయి. గిట్టుబాటు ధర లభిస్తుండడం, కమీషన్ల గొడవ లేకపోవడం, మధ్యవర్తుల ఊసే ఉండకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
వారంలోగా కొనుగోళ్లు..
యాసంగిలో ధాన్యం కొనుగో లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన క్రమంలో పీఏసీసీఎస్లతో అధికారులు సమావేశమయ్యారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమ య్యే అవకాశాలు ఉన్నాయి. ఇం దుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం. కల్వకుర్తి పీఏసీసీఎస్ పరిధిలో 23 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటారు. కేంద్రం పట్టించుకోకున్నా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండడంతో రైతన్నలు ఆనందంగా ఉన్నారు.
– తలసాని జనార్దన్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్, కల్వకుర్తి
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు. అన్నదాతల బాధ లు తెలిసిన మహామనిషి. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో మెలికలు పెడుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం వడ్లను కొంటున్నడు. యాసంగిలో కూడా ధాన్యం కొనాలని ఆదేశించడం చాలా సంతోషంగా ఉన్నది. ప ది రోజుల్లో పంటలు కోతకు వస్తాయి. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం వి క్రయిస్తాం. సీఎం కేసీఆర్కు రై తుల తరఫున కృతజ్ఞతలు.
– జనార్దన్రెడ్డి, రైతు, తాండ్ర, కల్వకుర్తి మండలం